143 ఏళ్ల క్రితం కేదార్ నాథ్ ఎలా ఉండేదంటే ..

ఇది 1882 నాటి పురాతన ఫోటో.. హిమాలయాల సరసన ఉన్న పవిత్ర కేదార్ నాథ్ ఆలయం.కిక్కిరిసిన భక్తులు,హెలికాప్టర్ సర్వీసులు,రద్దీ మార్కెట్లు లేని టైమ్ లోది. కేవలం హిమాలయాలు, ప్రకృతి మాత్రమే ఈ ఆలయానికి సజీవ సాక్ష్యాలు. సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో భీమశిల అనే రాతితో కట్టినది.తీర్ధ యాత్ర విహార యాత్రగా మారని క్రితం 143 ఏళ్ల క్రితం నాటి ఫోటో. రణగొణ ధ్వని లేని రద్దీ లేని ఓ చారిత్రక అద్భుతం.మహాభారతానికి సాక్ష్యంగా భావించే ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెబుతారు.



