← Back to news

బతికున్న మహిళ చనిపోయిందని..గదికి తాళం వేసిన పోలీసులు

By Vishi· 23 Aug 2026
బతికున్న మహిళ చనిపోయిందని..గదికి తాళం వేసిన పోలీసులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బెమెతరా జిల్లాలోని పరుశురామ్ చౌక్‌లో ఉరి వేసుకున్న మహిళను చూసిన పోలీసులు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఆమె మరణించినట్లు భావించారు. ఆ తర్వాత గదిలోకి మరెవరూ వెళ్లకుండా తాళం వేశారు. పంచనామా కోసం తలుపులు తెరవగా ఆ మహిళలో కదలికలు కనిపించాయి. ఆమె ఇంకా బతికే ఉందని గమనించిన కుటుంబసభ్యులు ఉరితాడు నుంచి కిందకు దించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

More in Current Affairs