గ్రూపు రాజకీయాలు వద్దు.. అభివృద్ధి కావాలి

TG : వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు గ్రూపు రాజకీయాలు పక్కనబెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆక్టివిస్ట్ డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ కోరారు. ‘మాకు మీ గ్రూపు రాజకీయాలు వద్దు.. అభివృద్ధి కావాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం అందాలి. గొడవలు లేకుండా రక్షణగా ఉండాలి’ అని ఆయన ప్లకార్డులతో డిమాండ్ చేశారు. లీడర్లు ప్రజల అవసరాలను గుర్తించి ఏరియా డెవలప్మెంట్ కోసం కష్టపడాలని అన్నారు.



