ఇంటర్నెట్ లేకున్నా UPI పేమెంట్స్: NPCI

ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేసేలా 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'(NPCI) కొత్త ఫీచర్ని తీసుకొస్తోంది. ఇకపై స్మార్ట్ఫోన్ లేదా వ్యాపారుల వద్ద ఉన్న PoS (పాయింట్ ఆఫ్ సేల్) మెషిన్లకు ఇంటర్నెట్ కనెక్షన్, సిగ్నల్ లేకపోయినా యూపీఐ ద్వారా ఈజీగా ప్రెమెంట్స్ చేయొచ్చు. ఈ విధానంలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(NFC) టెక్నాలజీ ఆధారంగా కస్టమర్లు తమ ఫోన్ను PoS మెషిన్పై ట్యాప్ చేసి రూ.2,000 వరకు పేమెంట్ చేయవచ్చు. దీనికి PIN ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.



