రీసెర్చ్ కోసం రైలెక్కిన హీరోయిన్!
'హార్ట్ ఎటాక్', 'కేరళ స్టోరీస్' సినిమాలతో మెప్పించిన హీరోయిన్ అదా శర్మ తాజాగా సామాన్య ప్రయాణికురాలిలా రైల్లో ప్రయాణించారు. రైలు ప్రయాణంలో గుర్తుపట్టిన అభిమానులతో ఆమె ఫోటోలు దిగారు. తన నెక్స్ట్ సినిమా రీసెర్చ్ కోసమే ఈ ప్రయాణమని చెబుతూ, ఎక్కడికి వెళ్తున్నానో ఊహించమంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.



