← Back to news

రేకుల షెడ్‌లోనే అక్షర యజ్ఞం

By DK· 20 Jul 2026· పోలవరం జిల్లా
రేకుల షెడ్‌లోనే అక్షర యజ్ఞం

AP: పోలవరం జిల్లా గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామపంచాయతీ పరిధిలోని మెట్టగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల దయనీయ స్థితిలో ఉంది. 51మంది విద్యార్థులు చదువుతున్న ఈ స్కూల్‌కు భవనం లేక మట్టిగోడలతో నిర్మించిన రేకుల షెడ్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్క ఉపాధ్యాయురాలే బోధిస్తున్నారు. బెంచీలు లేక విద్యార్థులు నేలపై కూర్చుని చదువుతున్నారు. ఎండకాలంలో షెడ్ వేడెక్కిపోగా, వర్షాకాలంలో పైకప్పు నుంచి నీరు కారుతోంది. మంచినీరు, మరుగుదొడ్లు, వంటగది కూడా లేదు. మౌలికవసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

More in Education