బ్యాంక్లోనే మోసం

TG: కామారెడ్డి జిల్లాలోని SBI బ్యాంక్లో మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు చాకచక్యంగా రూ.15వేల నగదును కాజేశారు. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన పూజ బ్యాంకులో నగదు లెక్కపెడుతుండగా ఇద్దరు వ్యక్తులు డబ్బులు సరిగ్గా లెక్కపెడతామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన ఆమె నగదు ఇవ్వగా, నోట్ల కట్టలో నుంచి రూ.15వేలు చాకచక్యంగా తీసేసి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత డబ్బు తక్కువగా ఉండటాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. CC ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.



