విద్యాసంస్థల బంద్ పిలుపు

నీట్, ప్రశ్నాపత్రాల లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ, రేపు (ఈ నెల 24న) AP, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్కు పలు విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు బంద్లో పాల్గొనాలని కోరాయి. SFI, PDSU, AISF, NSUI తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలపై విచారణ వంటి డిమాండ్లతో బంద్ నిర్వహించనున్నారు.



