← Back to news

పత్తి పంటకు ముప్పు రాకుండా.. రైతులకు కీలక దిశానిర్దేశం

By Jelandharkoti Koti· 22 Aug 2026
పత్తి పంటకు ముప్పు రాకుండా.. రైతులకు కీలక దిశానిర్దేశం

TG: పత్తి పంటలో చీడపీడలను తొలిదశలోనే గుర్తిస్తే నష్టాన్ని నివారించవచ్చని ఏఈఓ శ్రీనివాస్ రైతులకు సూచించారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నతిమ్మాపూర్ గ్రామంలో పత్తిపంటను ఆయన పరిశీలించారు. పంట ఎదుగుదల, మొక్కల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పంటలో చీడపీడల ఉనికిని ఎప్పటికప్పుడు గమనించాలని, తెగుళ్లు లేదా పురుగుల ప్రభావం కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమస్యను గుర్తించకుండా సొంతంగా మందులు వినియోగించడం వల్ల పంటకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.

More in Local