జీరో అడ్మిషన్లు.. విచారణలో షాకింగ్ ట్విస్ట్

TG: విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట జిల్లా తుంగుతర్తి మండలం బండరామారం ZP హైస్కూల్ HMతో పాటు నలుగురు ఉపాధ్యాయులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క కొత్త అడ్మిషన్ కూడా లేకపోవడంతో కలెక్టర్, DEO విచారణ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకు పంపించేలా ఉపాధ్యాయులే ప్రోత్సహించినట్లు, పాఠశాల ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించినట్లు గుర్తించారు. రికార్డుల నిర్వహణలో లోపాలు, అధికారుల ఆదేశాల ఉల్లంఘన కూడా బయటపడింది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీపడబోమని, బాధ్యులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.



