← Back to news

విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్

By dk· 12 Aug 2026· అనంతపురం జిల్లా
విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్

AP: అనంతపురం జిల్లా యల్లనూరు ZP ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమని తేలింది. టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.