బావిలో మోటారు రిపేర్..విషవాయువు పీల్చి నలుగురు మృతి

బిహార్లోని గయా జిల్లాలో బావిలో మోటారు రిపేర్ చేస్తూ విషవాయువు పీల్చి నలుగురు మరణించారు. చామరి మాంఝీ, అతని కుమారుడు దిల్చంద్ మాంఝీ, వికాస్ చౌదరి, విజయ్ చౌదరి రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని అధికారులకు ఆదేశించారు.



