← Back to news

రాబోయే 22 గంటల్లో వాయుగుండం..

By BK· 16 Aug 2026· AP
రాబోయే 22 గంటల్లో వాయుగుండం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 'స్పష్టమైన అల్పపీడనం'గా మారింది. ఇది రాబోయే 22 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.

More in AP