అప్పు ఎగ్గొట్టేందుకు MDపై కాల్పులు

మహారాష్ట్రలో GSM ఫాయిల్స్ కంపెనీ MD మోహన్సింగ్ను చంపడానికి ఆయన బిజినెస్ పార్ట్నర్ 'సాగర్' ప్లాన్ చేశాడు. సాగర్ షేర్ మార్కెట్లో నష్టపోయి మోహన్సింగ్ దగ్గర 32 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఎగ్గొట్టి, కంపెనీ మొత్తాన్ని లాక్కోవడానికే ఇద్దరు వ్యక్తులతో కాల్పులు జరిపించాడు. ఒక బుల్లెట్ మోహన్సింగ్ భుజానికి తగిలినా అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడి హాస్పిటల్ లో ఉన్నాడు. CCTV కెమెరాల ఆధారంగా పోలీసులు సాగర్ను అతనికి సాయం చేసిన వాళ్లందరినీ అరెస్టు చేశారు.



