దొంగతనం కాదు.. మరి చంపేసిందెవరు?

TG: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి(45) దారుణ హత్యకు గురయ్యారు. భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి చంపేశారు. ఇంట్లో దొంగతనం జరగలేదని, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా లేవని, నిన్న సాయంత్రం నుంచే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని ఇంటి కింద అద్దెకు ఉన్నవాళ్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని DSP, క్లూస్ టీమ్ పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు మూడు స్పెషల్ టీమ్స్తో సెర్చ్ చేస్తున్నారు.



