'వర్క్ ఫ్రమ్ హోమ్' సైబర్ దందా గుట్టురట్టు

చైనాతో లింకులున్న 'వర్క్ ఫ్రమ్ హోమ్' సైబర్ దందాను డిల్లీ పోలీసులు క్రాక్ చేశారు. జాబ్స్ పేరుతో రూ. 12 లక్షలు కాజేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ ద్వారా చైనాకు చెందిన నేరస్థులతో సంబంధాలు పెంచుకున్న యువకులు మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డబ్బును 'USDT' క్రిప్టోకరెన్సీ రూపంలోకి మారుస్తున్నట్టు గుర్తించారు. ఈ డబ్బును చైనాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. గురుగ్రామ్, గాజియాబాద్, నోయిడా, ఇటావాలో దాడులు చేసి వాళ్లను అరెస్ట్ చేశారు.



