'తల్లికి వందనం' పథకంపై Big Update

AP: తల్లికి వందనం పథకం డబ్బులు జూలై 22న లబ్ధిదారుల అకౌంట్లలో జమ కానున్నాయి. డబ్బులు రావాలంటే ఆధార్ను బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయడం, NPCI మ్యాపింగ్ పూర్తి చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఇవి పూర్తి కాకపోతే అకౌంట్లో డబ్బులు పడవని అధికారులు హెచ్చరించారు. ఈసారి 42,70,902 మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది.



