← Back to news

అప్పులు తీర్చలేక దొంగతనాల బాట

By dk· 16 Aug 2026· కామారెడ్డి జిల్లా
అప్పులు తీర్చలేక దొంగతనాల బాట

TG: కామారెడ్డిలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విద్యుత్‌నగర్‌ కాలనీలో నివాసముంటున్న మామిండ్ల లావణ్య ఇంట్లో ఈ నెల 7న దొంగతనం జరిగింది. దుండగుడు 16 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.90వేల నగదును అపహరించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పదంగా పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. విచారణలో అతడు దేవునిపల్లికి చెందిన వడ్ల శ్రీనివాస్‌గా గుర్తించారు. అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.