యువత కోసం పార్టీలన్నీ ఏకం కావాలి: యోగేంద్ర యాదవ్

AP: దేశ సమస్యలకు పరిష్కారం చూపే శక్తి యువతలో ఉందని, వారిని ప్రోత్సహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా కృషి చేయాలని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో బీపీ మండల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘రాజకీయ రంగంలో యువశక్తి-జెన్ జీ’ అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి వ్యవస్థల్లోని లోపాలే కారణమని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు.


