KTR పీఏ, పీఆర్వోపై దాడికి యత్నం
TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పీఏ మహేందర్, పీఆర్వో మహేష్లపై హైదరాబాద్ నగరం సైఫాబాద్ పోలీసుస్టేషన్లో దాడికి యత్నం జరిగింది. ఇటీవల అసెంబ్లీ గేటు దగ్గర పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించారనే ఆరోపణతో వాళ్ల మీద కేసు రిజిస్టర్ అయ్యింది. ఈ విషయంలో వారిద్దరూ స్టేషన్కు వెళ్లారు. అక్కడ పోలీసులు ఉండగానే గుర్తు తెలియని వ్యక్తుల ఈ దాడికి యత్నించారు. వాళ్లు ముసుగులు వేసుకొని ఉన్నారని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు.


