టైర్ పంచర్తో ఆగిన బస్సు.. క్షణాల్లో ఘోరం
TG: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్పేట్ వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంచర్ కావడంతో రోడ్డుపై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, డివైడర్ పక్కన కూర్చున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. గాయాలయిన వారిని దగ్గరలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



