← Back to news

టైర్‌ పంచర్‌తో ఆగిన బస్సు.. క్షణాల్లో ఘోరం

By Mahesh· 13 Aug 2026

TG: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌ వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్‌ పంచర్‌ కావడంతో రోడ్డుపై ఆగి ఉన్న ప్రైవేట్‌ బస్సును కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, డివైడర్‌ పక్కన కూర్చున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. గాయాలయిన వారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.