← Back to news

జిల్లా మైనింగ్ AD సస్పెండ్

By DK· 31 Jul 2026· అనకాపల్లి జిల్లా
జిల్లా మైనింగ్ AD సస్పెండ్

AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) మజ్జి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ పురుషోత్తంకు బాధ్యతలు అప్పగించారు. అక్రమ క్వారీ అనుమతులపై విచారణ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తవ్వకాల అనుమతులను రద్దు చేసి, పంచదార్లను 'నో మైనింగ్ జోన్'గా చర్యలు చేపట్టాలని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

More in AP