హైవేపై పల్టీలు కొట్టిన లారీ

AP: అనకాపల్లి జిల్లా శంకరం గ్రామం సమీపంలోని నేషనల్ హైవేపై రెండు లారీలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఒక లారీ మరో లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి పల్టీలు కొడుతూ సర్వీస్ రోడ్డుపై పడి కలెక్టర్ కార్యాలయ రహదారికి అడ్డంగా పడింది. మరో లారీ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో రెండు లారీల్లో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రెండు భారీ క్రేన్లతో లారీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.



