పెంపుడు జంతువులకు రిజిస్ట్రేషన్..రూ.5,000 జరిమానా

జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్ను సెప్టెంబర్ 30 నాటికి నమోదు చేసుకోకపోతే రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రేబిస్ వ్యాధి లేకుండా చేయడం, జంతువుల హెల్త్ డీటెయిల్స్ తెలుసుకోవడాని ఇది అవసరమని చెప్పింది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000, రెన్యూవల్ ఫీజు రూ.500గా అధికారులు నిర్ణయించారు. 3 నెలల వయసులోనే మొదటి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించి వివరాలు నమోదు చేయాలన్నారు.



