← Back to news

పింఛన్‌ కోసం బతికున్న భర్తను చంపేసింది

By dk· 14 Aug 2026· కృష్ణా జిల్లా
పింఛన్‌ కోసం బతికున్న భర్తను చంపేసింది

AP: వితంతు పింఛన్‌ పొందాలన్న ఆశతో బతికున్న భర్తను చనిపోయినట్లు చూపించి మరణ ధ్రువపత్రం పొందిన ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో వెలుగుచూసింది. కానూరు శివాలయం రోడ్డుకు చెందిన యర్రంశెట్టి రమాదేవి తన భర్త మురళీకృష్ణ మృతిచెందినట్లు తాడిగడప మున్సిపల్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మరణ ధ్రువపత్రం పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం ఇటీవల భర్తకు తెలియడంతో విచారణ చేపట్టారు. రమాదేవి తన తప్పును అంగీకరించినట్లు కమిషనర్‌ నజీర్ పేర్కొన్నారు. ఆమెపై కేసు నమోదు చేయాలని కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 6h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.