మహిమ చెంబుల మాయాజాలం బట్టబయలు

AP: శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో మహిమ గల రాగి చెంబుల పేరుతో అమాయకులను మోసం చేసి లక్షలు దోచుకునేందుకు కుట్ర పన్నిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక రసాయనాలు పూసిన రాగి చెంబుకు టార్చ్ వెలిగించగానే బల్బు ఫిలమెంట్ కాలిపోవడాన్ని "మహిమ"గా చూపించి, వాటికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించి భారీ మొత్తాలకు విక్రయించాలని యత్నించినట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి 4 రాగి చెంబులు, 2 టార్చ్ లైట్లు, 8 మొబైల్ ఫోన్లు, బలెనో కారు, హోండా మాస్ట్రో స్కూటీ, నగదు స్వాధీనం చేసుకున్నారు.



