రూ.22,006 కోట్లు అప్పులు..రూ.6.5 కోట్లకు ఫైనల్

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రా Personal Insolvency కేసులో జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్ కీలక ఆర్డర్ ఇచ్చింది. రూ.22,006.57 కోట్ల లోన్లలో సుభాష్ రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తారని చెప్పింది. ఎస్సెల్ గ్రూప్ కంపెనీల కోసం సుభాష్ పర్సనల్ గ్యారంటీ ఇచ్చారు. లోన్స్ తీర్చకపోవడంతో అప్పులిచ్చినవాళ్లు 2024లో పిటిషన్ వేశారు. విచారించిన ట్రిబ్యూనల్ ఈ తీర్పు ఇచ్చింది. ఇది చాలా తక్కువ మొత్తం అని అభ్యంతరపెట్టినా,‘బ్యాంక్రప్ట్సీలోకి పంపితే ఇంకా తక్కువ రావచ్చు’ అని ట్రిబ్యునల్ ఈ అమౌంట్ని ఫైనల్ చేసింది.


