← Back to news

దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ (AICC) ఫోకస్

By Mahesh· 28 Jul 2026
దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ (AICC) ఫోకస్

TG: దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ఆర్గనైజేషన్ కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇందులో తెలంగాణ సంస్థాగత కార్యక్రమాలు, సంఘటన్ సృజన్ అభియాన్ (SSA) కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. తెలంగాణలో ఈ కార్యక్రమాల అమలును కే.సీ. వేణుగోపాల్ అభినందించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అమలు చేయాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.

More in Politics