కోర్టుకు వెళ్లకుండానే కేసు డిస్పోజ్

TG: "డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పడిందా? డబ్బులిస్తే అంతా మేం చూసుకుంటాం" కొందరు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల స్కెచ్ ఇది. రూ.15 వేల లంచం తీసుకుని, ముద్దాయి కోర్టు ముఖం కూడా చూడకుండానే కేసు డిస్పోజ్ చేసేశారు. 2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు 14 కేసుల్ని లంచాలతో క్లోజ్ చేసినట్లు తేలింది. ఇందు కోసం రూ.34,700 పైన లంచాలు తీసుకున్నారని బయటపడింది. RSI శ్రీకాంత్, కానిస్టేబుల్స్ సాయికృష్ణ, కిరణ్లను CP గౌస్ ఆలం సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు.



