← Back to news

కోర్టుకు వెళ్లకుండానే కేసు డిస్పోజ్

By DK· 29 Jul 2026· కరీంనగర్ జిల్లా
కోర్టుకు వెళ్లకుండానే కేసు డిస్పోజ్

TG: "డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పడిందా? డబ్బులిస్తే అంతా మేం చూసుకుంటాం" కొందరు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల స్కెచ్ ఇది. రూ.15 వేల లంచం తీసుకుని, ముద్దాయి కోర్టు ముఖం కూడా చూడకుండానే కేసు డిస్పోజ్ చేసేశారు. 2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు 14 కేసుల్ని లంచాలతో క్లోజ్ చేసినట్లు తేలింది. ఇందు కోసం రూ.34,700 పైన లంచాలు తీసుకున్నారని బయటపడింది. RSI శ్రీకాంత్, కానిస్టేబుల్స్ సాయికృష్ణ, కిరణ్‌లను CP గౌస్ ఆలం సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 13h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.