← Back to news

సినిమా చూస్తుండగానే బాలీవుడ్ నటికి బిగ్ షాక్..

By Balakrishna· 30 Jul 2026
సినిమా చూస్తుండగానే బాలీవుడ్ నటికి బిగ్ షాక్..

బాలీవుడ్ నటి, నిర్మాత కీర్తి కుల్హారీ సైబర్ మోసానికి గురయ్యారు. ముంబైలోని ఒక మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తుండగా, ఆమె క్రెడిట్ కార్డు ద్వారా ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్‌లో 2,525 డాలర్ల విదేశీ లావాదేవీ జరిగినట్లు మెసేజ్ వచ్చింది. ఓటీపీ ఎవరికీ షేర్ చేయకపోయినా, నిమిషాల వ్యవధిలోనే 4 ఇల్లీగల్ లావాదేవీల ద్వారా రూ. 2.43 లక్షలకు పైగా మాయమైపోయాయి.కీర్తి ఫిర్యాదుతో అంబోలి పోలీసులు, సైబర్ సెల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 12h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.