జెత్వానీ కేసులో ట్విస్ట్.. ఇద్దరు IPSల సస్పెన్షన్ ఎత్తివేత!

AP: ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసులో సస్పెండ్ అయిన ఏపీ IPS అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది. గతంలో వీరిద్దరిపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. కాంతి రాణా టాటాను సెప్టెంబర్ 4 నుంచి, విశాల్ గున్నిని సెప్టెంబర్ 5 నుంచి తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఫోర్జరీ డాక్యుమెంట్స్తో కేసు రిజిస్టర్, పవర్ మిస్యూజ్, పొలిటికల్ ప్రెజర్ బ్యాక్గ్రౌండ్లో జెత్వానీ, ఆమె ఫ్యామిలీను వేధించారనే ఆరోపణలతో వీరిపై యాక్షన్ తీసుకున్నారు.


