వాల్యుయేషన్ సిస్టమ్ ని షేక్ చేసిన ‘సార్ధక్ సిద్ధాంత్’!

దేశ వ్యాప్తంగా మారు మోగిన CBSE అవకతవకలు బయట పెట్టినది ఎవరో తెలుసా? జార్ఖండ్కు చెందిన 18 ఏళ్ల సార్ధక్ సిద్ధాంత్, CBSE డిజిటల్ ఎగ్జామ్ ఇవాల్యుయేషన్ (OSM) సిస్టమ్లోని లూప్హోల్స్ను బయటపెట్టి హీరో అయ్యాడు. తన రిజల్ట్స్ తక్కువ రావడంతో డౌట్ వచ్చి.. RTI (సమాచార హక్కు చట్టం) ద్వారా ఆన్సర్ షీట్స్ తెప్పించుకుని, ఏకంగా 576 ప్రభుత్వ టెండర్ డాక్యుమెంట్లను లైన్ టు లైన్ స్టడీ చేసి ఈ స్కామ్ను ఎండగట్టాడు.బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలకే మళ్లీ కాంట్రాక్ట్స్ ఇచ్చారని ఆధారాలతో నిరూపించిన ఈ కుర్రాడి ఇన్వెస్టిగేషన్ దెబ్బకి పార్లమెంట్ ప్యానెల్ కూడా స్పందించాల్సి వచ్చింది!



