చరిత్రకారుడు సుమిత్ సర్కార్ కన్నుమూత

ప్రముఖ చరిత్రకారుడు, స్కాలర్ సుమిత్ సర్కార్(87) ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖ స్కాలర్ అయిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. లండన్లోని వుల్ఫ్సన్ కాలేజీలో ఫెలోగా కూడా పనిచేశారు. ‘ది స్వదేశీ మూవ్మెంట్ ఇన్ బెంగాల్, 1903-1908’ అని 1973లో ఆయన రాసిన పుస్తకం బెంగాల్లోని జాతీయోద్యమంపై వచ్చిన ముఖ్యమైన పుస్తకంగా మిగిలింది.



