‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. షనాయా కపూర్ ఎంట్రీ

‘జాంబీ రెడ్డి 2 NXT LVL’ టైటిల్ను మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. తేజ సజ్జ మరోసారి హీరోగా కనిపించనున్నారు. హైదరాబాద్లో జాంబీలు విజృంభించే కథతో సీక్వెల్ సాగనుంది. కన్నడ స్టార్ ఉపేంద్ర మెయిన్ రోల్ లో నటించనుండగా.. షనాయా కపూర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. సుపర్ణ్ S. వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 2027లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.



