మోదీకి బంగారు విగ్రహంతో త్వరలో ఆలయం?

ప్రధాని నరేంద్ర మోదీకి బంగారు విగ్రహంతో ఆలయం నిర్మించాలని బిహార్ స్టేట్ కిన్నర్ వెల్ఫేర్ బోర్డు (ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు) ప్లాన్ చేసింది. ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి, రూ.112 కోట్ల నిధులు కేటాయించాలని బోర్డు కోరింది. బోర్డు తొలి సమావేశంలో సభ్యుడు డా.రాజన్ సింగ్ ఈ ప్రతిపాదన పెట్టారు. బోర్డు సభ్యులు దీన్ని ఆమోదించారు. ఈ ప్రతిపాదన క్యాబినెట్ సెక్రటేరియట్కు వెళ్లనుంది. ప్రభుత్వం భూమి, నిధులు ఇవ్వకపోయినా డొనేషన్లు సేకరించి ఆలయం నిర్మిస్తామని బోర్డు సభ్యులు చెప్పారు.



