← Back to news

మోదీకి బంగారు విగ్రహంతో త్వరలో ఆలయం?

By vishi· 12 Aug 2026· Etvbharat
మోదీకి బంగారు విగ్రహంతో త్వరలో ఆలయం?

ప్రధాని నరేంద్ర మోదీకి బంగారు విగ్రహంతో ఆలయం నిర్మించాలని బిహార్ స్టేట్ కిన్నర్ వెల్ఫేర్ బోర్డు (ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు) ప్లాన్ చేసింది. ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి, రూ.112 కోట్ల నిధులు కేటాయించాలని బోర్డు కోరింది. బోర్డు తొలి సమావేశంలో సభ్యుడు డా.రాజన్ సింగ్ ఈ ప్రతిపాదన పెట్టారు. బోర్డు సభ్యులు దీన్ని ఆమోదించారు. ఈ ప్రతిపాదన క్యాబినెట్ సెక్రటేరియట్‌కు వెళ్లనుంది. ప్రభుత్వం భూమి, నిధులు ఇవ్వకపోయినా డొనేషన్లు సేకరించి ఆలయం నిర్మిస్తామని బోర్డు సభ్యులు చెప్పారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 11h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.