AI లెర్నింగ్ కోసం స్టూడెంట్లవుతున్న సీఈఓలు

టెక్నాలజీ మారుతున్న వేగాన్ని అందుకోవడానికి దశాబ్దాల అనుభవం ఉన్న టాప్ కంపెనీల సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు మళ్లీ స్టూడెంట్స్గా మారుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై అవగాహన పెంచుకోవడానికి వారు గ్లోబల్ బిజినెస్ స్కూల్స్లో చేరుతున్నారు. కోట్లాది రూపాయల AI పెట్టుబడులపై సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, డేటా ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ సవాళ్లను అధిగమించడానికి ఈ కోర్సులు వీరికి సహాయపడుతున్నాయి. కంపెనీలను భవిష్యత్తుకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది.



