ఈనెల 5న మహారాష్ట్రలో CJP కీలక సమావేశం

CJP భవిష్యత్తు కార్యాచరణపై కీలక సభ్యులతో ఈనెల 5న మహారాష్ట్రలోని సంభాజీనగర్లో సమావేశముంటుందని ఆ పార్టీ తెలిపింది. ఈ సమావేశం CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే ఇంట్లో జరుగుతుందని వారు తెలిపారు. గత నెల దిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీక్కు వ్యతిరేకంగా పార్టీ నెల రోజుల పాటు నిరసనలు చేపట్టింది. ప్రొటెస్ట్లు ఆగడంతో సపోర్టర్లు, వాలంటీర్లు కొన్నిరోజులు తమ ఫ్యామిలీతో గడపాలని పార్టీ వారితో చెప్పినట్లు తెలుస్తోంది.


