ఐదేళ్లు DSC ఎందుకు వేయలేదు? బొత్సకు అచ్చెన్న ప్రశ్న

AP: మెగా DSCపై YSRCP నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో ప్రశ్నలు వేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు DSC ఎందుకు నిర్వహించలేదని బొత్సను ప్రశ్నించారు. DSC వేయాలని అప్పటి CM జగన్ను ఎందుకు కోరలేదని నిలదీశారు. దీంతో YSRCP MLCలు పోడియం వద్ద నిరసన విరమించారు. ఇదిలా ఉండగా, ఇటీవల అస్వస్థతకు గురైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా కొందరు పరామర్శించారు.



