శ్రావణ మాసం ఎఫెక్ట్.. పోటెత్తిన భక్తులు

TG: శ్రావణ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా కోటిలింగాల శైవక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వెల్గటూర్ మండలంలోని పవిత్ర గోదావరి తీరంలో ఉన్న శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగాదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గోదావరి నది తీరం భక్తుల సందడితో కళకళలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.



