ఇండోనేషియాలో ప్రధానికి అపూర్వ స్వాగతం
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇండోనేషియా చేరుకున్నారు. ఆయన విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే, ఆ దేశ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎఫ్-16, సుఖోయ్-30 యుద్ధ విమానాలు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఆ ఫైటర్ జెట్స్ మోదీ విమానానికి ఇరువైపులా రక్షణగా (ఎస్కార్ట్గా) ఫార్మేషన్లో ఎగురుతూ జకార్తా వరకు తోడుగా వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక, రక్షణ సంబంధాలకు నిదర్శనంగా నిలిచిన ఈ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.



