సెషన్స్ తొలిరోజే రాహుల్ పై మోడీ సెటైర్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్ వేశారు. శనివారం కక్ష్యలోకి చేరి రికార్డు సృష్టించిన విక్రమ్-1 ప్రైవేట్ రాకెట్ (స్కైరూట్ ఏరోస్పేస్) బృందం సగటు వయసు 28 ఏళ్లేనని మోదీ ప్రశంసించారు. తాను దేశంలో తిరుగుతున్న కొందరు "56 ఏళ్ల యువకుల" గురించి మాట్లాడటం లేదని, నిజమైన యంగ్ సైంటిస్టుల ప్రతిభను మెచ్చుకుంటున్నానని అనడంతో సభలో నవ్వులు పూశాయి.



