మతాలకు అతీతమైన మానవత్వం..అదే ‘కేరళం’

కేరళం రాష్ట్రం మరోసారి మతాలకతీతంగా నిలబడి తన ఘనత చాటింది. చోట్టానిక్కరకు చెందిన ఆర్థడాక్స్ క్రైస్తవ ఫాదర్ ఓ.జె. జేకబ్ ఇంట్లో 26 ఏళ్లుగా ఉన్న పార్వతి(88) అనే మహిళకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అదే సమయంలో క్రైస్తవ ప్రార్థనలు కూడా చేశారు. 2000లో ఫాదర్ జేకబ్ భార్య మరణించిన తర్వాత ఆయన ఆరేళ్ల కుమార్తె మెరిన్ను చూసుకోవడానికి పార్వతి అక్కడికి వచ్చారు. అలా ఆ కుటుంబంలో మనిషిగా మారారు.


