ఆదివాసీ మహిళకు షాకింగ్ ట్విస్ట్

TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం జవహర్నగర్కు చెందిన హీరకుమ్ర లక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు పథకం దరఖాస్తులో ఊహించని షాక్ ఎదురైంది. ఆన్లైన్ రికార్డుల్లో ఆమె పేరుపై ఇప్పటికే ఇల్లు మంజూరై, రూ.51,200 విడుదలైనట్లు నమోదైంది. అయితే వాస్తవానికి ఆమెకు ఎలాంటి ఇల్లు లేదు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసినా L3 జాబితాలో నిలిచిపోయింది. గతంలో హౌసింగ్ అధికారులు రేషన్కార్డ్ వివరాలను దుర్వినియోగం చేసి అక్రమంగా నిధులు మళ్లించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకుని ఇల్లు ఇప్పించాలని ఆమె కోరింది.



