← Back to news

వేగంగా దూసుకొచ్చిన కారు

By DK· 29 Jul 2026· మేడ్చల్ జిల్లా

TG: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని అనంతారం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతారానికి చెందిన జమాలుద్దీన్‌ బైక్‌పై వెళ్తుండగా, లక్ష్మాపూర్‌కు చెందిన వ్యక్తి నడుపుతున్న కారు మంగళవారం రాత్రి అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. జమాలుద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సమీపంలోని CCTV కెమెరాల్లో రికార్డవడంతో ఘటన తీవ్రత వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 13h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.