← Back to news

డబ్బు తీసుకున్న క్షణంలోనే ACB షాక్

By dk· 6 Aug 2026· అనకాపల్లి జిల్లా
డబ్బు తీసుకున్న క్షణంలోనే ACB షాక్

AP: అనకాపల్లి జిల్లాలో ACB అధికారులు మైన్స్ శాఖ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్‌ను రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ క్వారీ సర్వే రిపోర్ట్ నిమిత్తం మొత్తం రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు సందిన సునీల్ ACBని ఆశ్రయించారు. అధికారుల సూచనల మేరకు బాధితుడు రూ.5లక్షలు అడ్వాన్స్ అందజేస్తుండగా, ముందుగా మాటువేసిన ఏసీబీ అధికారులు సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.