ఇండియాలోకి ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయా?

భారత్లో కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను ప్రవేశపెట్టడంపై రిజర్వ్ బ్యాంక్ (RBI) మళ్లీ కసరత్తు చేస్తోంది. పేపర్ నోట్ల ప్రింటింగ్ కోసం ఏటా సుమారు రూ.5,000 నుండి 6,000 కోట్లు ఖర్చవుతుండడం, అవి త్వరగా పాడైపోతుండడంతో ఈ ప్లాన్ రెడీ చేశారు. ఈ ప్లాస్టిక్ నోట్ల వల్ల నకిలీ నోట్ల బెడద తగ్గడమే కాకుండా, ఏటీఎంలలో వచ్చే సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చని ఆర్బీఐ భావిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.



