← Back to news

రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్ల నిరసన

By Mahesh· 20 Jul 2026· AP
రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్ల నిరసన

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివాదాస్పద జీవో 369ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్స్ పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘ పెనుమాక సుబ్బారావు పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి జులై 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక పెన్‌డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ అకస్మాత్తు నిర్ణయాలతో తమ వృత్తికి భవిష్యత్తులో ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

More in News