ఇంటర్ పరీక్షల్లో కొత్త రూల్స్.. 2027 నుంచే అమలు!

ఇంటర్ విద్యలో ఏళ్లుగా ఉన్న బట్టీ పద్ధతికి ప్రభుత్వం చెక్ పెట్టనుంది. 2027-28 అకడమిక్ ఇయర్ నుంచి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారనుంది. కేంద్ర ‘పరాఖ్’ గైడ్లైన్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 10 శాతం ప్రశ్నలను కొత్తగా ప్రిపేర్ చేయనున్నారు. స్టూడెంట్స్ చదివింది గుర్తుపెట్టుకున్నారా అనే దానికంటే, కొత్త పరిస్థితుల్లో ఎలా అప్లై చేస్తున్నారు, ఎంతవరకు అర్థం చేసుకున్నారనే దానిపై ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం లెక్చరర్లకు ట్రైనింగ్, వర్క్షాప్స్ నిర్వహించి క్వశ్చన్ బ్యాంక్ రూపొందిస్తున్నారు.


