చివరి ప్రయాణానికీ దారి లేదు

AP: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు తూర్పుపేటలో స్మశానానికి వెళ్లేందుకు సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మృతదేహాలను పొలాల గట్లు, బురద మార్గాల మీదుగా మోసుకెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారిందన్నారు. నిన్న ఓ వ్యక్తి చనిపోవడంతో పొలాల్లోకి దిగి తీసుకెళ్లారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.



