మోదీ మరో Insta వీడియో, ఏం చెప్పారంటే..
భారత ఆర్థిక వ్యవస్థ 7.8% GDP గ్రోత్ సాధించడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సప్లై చైన్ సమస్యలు, ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ఈ స్థాయిలో ప్రగతి సాధించడం మన కాన్ఫిడెన్స్కి నిదర్శనమని అన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా', 'వోకల్ ఫర్ లోకల్' కాన్సెప్ట్లను ఫాలో అవుతూ స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అనవసర విదేశీ టూర్లు, బంగారం కొనుగోళ్లు తగ్గించి, 140 కోట్ల మంది ఐక్యతతో దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.



